విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతు కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై పిటిషనర్, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
తగినంత స్థలం లేదు: ప్రభుత్వ వాదన