ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్లు కుదించేందుకు వీలుగా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలోనే ఈ జీవో అమలును నిలిపివేసిన న్యాయస్థానం... ఇప్పుడు కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు వినిపించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.... గతంలో సెక్షన్కు 88మంది చొప్పున 9 సెక్షన్లకు గరిష్టంగా 792 మంది విద్యార్థుల్ని చేర్చుకునే అవకాశం ఉండేదని నివేదించారు. ప్రభుత్వ జీవోతో సెక్షన్కు 40 మంది చొప్పున మొత్తం 360 మందికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోపాల పేరిట అన్ని కాలేజీలను సాధారణీకరిస్తూ సీట్లు కుదించడం సరికాదన్నారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించినందున... కళాశాలల్లో సీట్లు పెంచాలే తప్ప తగ్గించరాదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... జీవో 23ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
విధివిధానాలు రూపొందించండి...