ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2020, 8:52 PM IST

ETV Bharat / city

రోహత్గీకి ఐదు కోట్ల ఫీజుపై వివరణ కోరిన హైకోర్టు

రోహత్గీకి ఐదు కోట్ల ఫీజును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ రిఫరెన్స్ మీద జీవో విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం వివరణ కోరింది. రాజధానిపై దాఖలైన కేసుల విషయంలో ప్రభుత్వం తరఫున వాదించేందుకు రోహత్గీని నియమించుకుంది.

high court on advocate rohatgi  fee
high court on advocate rohatgi fee

రాజధానిపై కేసులు వాదించేందుకు రోహత్గీకి రూ.5 కోట్ల ఫీజును ప్రభుత్వం చెల్లించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటి అడ్వాన్స్‌ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ప్లానింగ్ శాఖ కార్యదర్శితో పాటు ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం... ఏ రిఫరెన్స్ మీద జీవో విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వ వివరణ కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details