ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనుబంధ పిటిషన్​పై విచారణ 29కి వాయిదా - అమరావతి భూములపై ఏసీబీ కేసులు న్యూస్

రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో ఈ నెల 15న హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని న్యాయవాది మమతారాణి కోరారు. తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్​పై విచారణ ఈ నెల 29 కి వాయిదా పడింది.

high court on acb cases about capital amaravathi lands
high court on acb cases about capital amaravathi lands

By

Published : Sep 26, 2020, 4:06 AM IST

రాజధాని భూములపై వాదనలు వినిపించేందుకు తనకు అవకాశమివ్వాలని న్యాయవాది మమతారాణి వేసిన పిటిషన్​పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. అంతకు ముందు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ ... కౌంటర్ దాఖలు చేయడానికి సోమవారం వరకు సమయం కావాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ .. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్​పీ దాఖలు చేసిందన్నారు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. మంగళవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ విచారణను ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details