ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు

By

Published : Oct 6, 2021, 10:38 PM IST

Updated : Oct 7, 2021, 1:48 AM IST

పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు
పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు

22:29 October 06

పుష్పశ్రీవాణి కులధ్రువీకరణపై హైకోర్టులో పిటిషన్

కుల ధ్రువపత్రం వివాదంపై ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీచేసింది . పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని , శ్రీవాణిని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు . పిటిషనర్ తరపు న్యాయవాది బి.శశిభూషణ్ రావు వాదనలు వినిపిస్తూ 'ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదన్న ఫిర్యాదుపై అప్పీలు విచారణ గిరిజన శాఖ మంత్రి దృష్టికి వచ్చింది కానీ ఆమెనే ఆ శాఖకు మంత్రి. ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్ పై ఆమే విచారణ చేయడం చట్ట విరుద్ధం. ఏపీ , ఎస్సీ , ఎస్టీ , బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి ' అని కోరారు. 

ఇదీ చదవండి.. 

High Court: 'మూలధన విలువ అధారిత ఆస్తి పన్ను సవరణ చట్టం'పై కౌంటర్​ దాఖలు చేయండి

Last Updated : Oct 7, 2021, 1:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details