ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల

By

Published : Aug 23, 2020, 7:56 AM IST

Updated : Aug 23, 2020, 11:55 AM IST

రాష్ట్రంలోని పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 38.74 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీలో 2.8 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీలో 18.10 అడుగుల మేర నీరు చేరిందన్నారు.

heavy water inflow to pulichintala, dawaleshwaram, prakasam projects in state
ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు

నాగార్జున సాగర్ సాగర్ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో పులిచింతలకు నీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 3,27,512 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులుగా కాగా... ప్రస్తుతం 170.27 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 38.74 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 2,67,775 క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజ్‌ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 2,76,996 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 2,18,325 క్యూసెక్కులు కాగా... ప్రస్తుత నీటినిల్వ 2.8 టీఎంసీలుగా ఉంది.

ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ‌బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 17.79 అడుగులగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 19.31లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.

ఇదీ చదవండి:

లంక గ్రామాలను రెండుసార్లు కుదిపేసిన గోదావరి వరద

Last Updated : Aug 23, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details