ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని వ్యాజ్యాలపై 15న విచారణ - హైకోర్టు రాజదాని అంశం

రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 15న విచారణ జరగనుంది. కొవిడ్ కారణంగా గత కొంత కాలంగా విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానంలో (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానంలో విచారణ చేపట్టనుంది.

hc on capital issues
hc on capital issues

By

Published : Nov 13, 2021, 6:25 AM IST

రాజధానికి సంబంధించి పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానంలో (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానంలో విచారణ చేపట్టనుంది.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కొవిడ్, తదితర కారణాలతో విచారణ వాయిదాపడుతూ వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 23 న విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని బెంచ్ విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది . ఎలాంటి అంతరాయమూ లేకుండా రోజువారీ పద్ధతిలో వాదనలు కొనసాగేందుకు వీలుగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

న్యాయవాదులు వ్యక్తిగత కారణాలతో వాయిదాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని వ్యాజ్యాలపై సోమవారం కొత్త సీజే నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది.

ఇదీ చదవండి:TDP complaint to SEC: 'ప్రచారం నిర్వహిస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details