ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SAILING: హుస్సేన్​ సాగర్​లో జాతీయ 'సెయిలింగ్'​ పోటీలు - governor tamilisai inaugurated sailing competitions

హైదరాబాద్​ హుస్సేన్​ సాగర్​లో జాతీయ 35వ సెయిలింగ్​ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు గవర్నర్​ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెయిలింగ్​ క్రీడలాగే జీవితంలో కష్టాలకు భయపడకూడదని గవర్నర్​ సూచించారు.

sailing-competitions
sailing-competitions

By

Published : Aug 13, 2021, 11:43 PM IST

సెయిలింగ్ చాలా క్లిష్టమైన క్రీడ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ హుస్సేన్‌సాగర్‌లో జాతీయ 35వ సెయిలింగ్ పోటీలను గవర్నర్‌ ప్రారంభించారు. గాలి వేగాన్ని ఆశావహులు తమకు అనుకూలంగా మలచుకుని ఎదురీదుతూ.. ముందుకు సాగుతారని తమిళిసై పేర్కొన్నారు. ఈ పోటీల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

హుస్సేన్​ సాగర్​లో జాతీయ 'సెయిలింగ్'​ పోటీలు

జాతీయ స్థాయి పోటీలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సెయిలర్లను గవర్నర్‌ అభినందించారు. హుస్సేన్‌సాగర్ లేక్‌ను శుభ్రం చేసి జంట నగరాల ప్రజలకు అవగాహన కల్పించారని కొనియాడారు. భవిష్యత్తులో మంచి శిక్షణ ఇచ్చి దేశానికి పథకాలు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఒలింపిక్స్‌ సెయిలింగ్‌ విభాగంలో పతకం సాధించిన నేత్ర కుమరన్, విష్ణు శరవణన్‌ను గవర్నర్ తమిళిసై సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఈఎమ్​ఈ సెయిలింగ్ అసోషియేషన్ కమడోర్​,​ లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్, వైఎస్ కమడోర్ జేఎస్ సిధాన, ఎస్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రఘురాంరెడ్డి, ఉపాధ్యక్షుడు రాహుల్ రావు, అర్జున అవార్డు గ్రహీత రాజేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details