ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2021, 5:42 AM IST

Updated : Apr 11, 2021, 6:09 AM IST

ETV Bharat / city

ఉగాది స్పెషల్ : వాలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లు విడుదల

ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు 261 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

వాలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లు విడుదల
వాలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లు విడుదల

ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేసింది. వాలంటీర్లను సత్కరించడం సహా ఇతర అవసరాలకు గానూ 261 కోట్ల రూపాయలను విడుదలచేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు.

విశిష్ట సేవలు..

వాలంటీర్లకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు.. ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్రల పేరిట విశిష్ట సేవలు అందించిన... గ్రామ, వార్డు వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఉగాది రోజున.. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

:నేటి నుంచి టీకా ఉత్సవ్.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత

Last Updated : Apr 11, 2021, 6:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details