ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేశారు: గవర్నర్‌ ‌

భారతరత్న డాక్టర్. బీ.ఆర్​.అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ నివాళులర్పించారు. ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేశారని.. గవర్నర్ గుర్తుచేశారు.

By

Published : Apr 14, 2021, 7:45 AM IST

Updated : Apr 14, 2021, 11:35 AM IST

governer bishwabushan harichandan tributes to ambedkar on his birth anniversary
ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేశారు: గవర్నర్‌

భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ జన్మదినాన్ని.. రాజ్ భవన్​లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఘనంగా నిర్వహించారు. కులం, మతం ప్రాతిపదికన తేడాలు లేని ఆధునిక భారతదేశం కోసం నిరంతర పోరాటం చేశారని గవర్నర్‌ కొనియాడారు. మహిళలకు, సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. అంబేడ్కర్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి చేసిన కృషి మరువలేనిదని గవర్నర్ స్మరించుకున్నారు.

Last Updated : Apr 14, 2021, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details