ముఖ్యమంత్రి జగన్ రాజధాని రైతులకు వెన్నుపోటు పొడిచారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన దిల్లీ పెద్దలే గవర్నర్ ద్వారా రెండో పోటు పొడిచారని ఆరోపించారు. వీరందరికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు.
'రైతులకు జగన్ వెన్నుపోటు పొడిస్తే... దిల్లీ పెద్దలు రెండోపోటు పొడిచారు' - సీఎం జగన్పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు
సీఎం జగన్పై తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులకు దిల్లీ పెద్దలతో కలిసి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా నేత