ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగునీటి ప్రాజెక్టులకు జర్మనీ సంస్థల సహకారం: మంత్రి అనిల్

మంత్రి అనిల్​తో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్​ సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు జర్మనీ సంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి చెప్పారు.

By

Published : Mar 22, 2021, 6:53 PM IST

minister anil kumar
minister anil kumar

రాష్ట్రంలో 51 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి.. వివిధ ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్​తో మంత్రి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో చేపడుతున్న నీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు జర్మనీ సంస్థలు సహకారం అందిస్తున్నాయని మంత్రి వివరించారు. ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేపట్టేందుకు జర్మనీ ఆసక్తితో ఉందని కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details