గ్రామీణ, పట్టణస్థాయి వలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింప చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణలో భాగస్వాములైన గ్రామ, వార్డు వలంటీర్లకు ఈ ప్యాకేజీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఉన్నారు. వీరంతా మూడు విడతలుగా కొవిడ్ -19 ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ పేషెంట్లతో కలిసే అవకాశం ఉంది. వీరికి అండగా ఉండేందుకు ఈ ప్యాకేజీ కింద బీమా కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
గ్రామీణ, పట్టణస్థాయి వలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింపు - ఏపీలో వాలంటీర్లకు ప్రధానమంత్రి కళ్యాణ్ ప్యాకేజీ
గ్రామీణ, పట్టణస్థాయి వలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వే చేపడుతున్న వలంటీర్లకు... కరోనా పాజిటివ్ పేషెంట్లతో కలిసే అవకాశం ఉన్నందున వారికి బీమా కల్పించనుంది.
garib-kalyan-yojana-to-ap-volunters