ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 17, 2021, 6:54 PM IST

ETV Bharat / city

Vinayaka chaturthi 2021: సెప్టెంబర్‌ 10 నుంచి గణేశ్​ ఉత్సవాలు

సెప్టెంబర్‌ 10 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. తెలంగాణలోని భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు.

Ganesh chaturthi 2021 celebrations start from september 10
సెప్టెంబర్‌ 10 నుంచి గణేశ్​ ఉత్సవాలు..

సెప్టెంబర్‌ 10వ తేదీన వినాయక ఉత్సవాలు(Vinayak chaturthi 2021) ప్రారంభమవుతాయని.. తెలంగాణలోని భాగ్యనగర్‌ గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని తెలిపారు. గణేశ్​ ఉత్సవాలకు సంబంధించిన ముడిసరుకును సమయానికి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.

గణేశ్​ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్‌ ప్లాంట్స్‌ ఉపయోగిస్తున్నట్లు భగవంతరావు పేర్కొన్నారు. నిమజ్జన సమయానికి రోడ్లు బాగుండేలా చేయాలని జీహెచ్‌ఎంసీని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల ప్రకారంగా మండపాల్లో అన్ని జాగ్రత్తలు చేపడతామని స్పష్టం చేశారు. మండపాల్లో దేశభక్తి, దైవభక్తి పాటలు మాత్రమే ఉండాలని సూచించారు. గణేశ్​ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని తెలిపారు. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని భగవంత్​రావు కోరారు.

40 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్న గణపయ్య

ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈసారి 40 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ విగ్రహ నమూనాను ఆవిష్కరించింది. ఈసారి పంచముఖ రుద్రమహాగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఎడమవైపున కాలానాగదేవత, కుడివైపు కాల విష్ణు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. గణనాథుడికి ఇరువైపులా కృష్ణ కాళీ, కాళ నాగేశ్వరి మూర్తుల విగ్రహాలు ఉంచనున్నట్లు ఉత్సవకమిటీ వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శిల్పి రాజేంద్రన్​ ఆధ్వర్యంలో 40 అడుగుల పంచముఖ రుద్రమహాగణపతి విగ్రహం రూపుదిద్దుకోనుంది.

నిబంధనలు పాటిస్తూ..

సెప్టెంబర్‌ 10 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని గణేశ్​ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని సూచించింది. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

1954లో ఒక్క అడుగుతో గణేశుడు

1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లో ఒక్క అడుగుతో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. 2019లో 65 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చాడు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో గణేశుడి విగ్రహాన్ని భారీ ఎత్తున తీర్చిదిద్ది.. 11 రోజులపాటు అంగరంగవైభవంగా పూజలు నిర్వహించేవారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గతేడాది గణనాథుడు 18 అడుగులకే పరిమితమయ్యాడు. ఈసారైనా అధిక ఎత్తులో విగ్రహం ప్రతిష్ఠించి.. అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనా రెండో దశ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గడంతో.. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. గణేష్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు కొనసాగనుంది.

ఇదీ చూడండి:

minister photo: శిలాఫలకంపై.. ‘చిత్రం’గా మార్చేశారు..!

ABOUT THE AUTHOR

...view details