ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కరోనా పేషంట్లతో ఐసీయూ ఫుల్.. ఇలాగే కొనసాగితే కష్టమే - amaravathi news

కరోనా వ్యాప్తిని ఆపడం ప్రజల చేతుల్లోనే ఉందని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్‌ రాజారావు అన్నారు. సాధ్యమైనంతవరకు ఇళ్లలో ఉండటమే సురక్షితమని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లకూడదని సూచించారు. ఆస్పత్రుల్లోనూ వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

gandhi hospital on corona services
కరోనా పేషంట్లతో ఐసీయూ ఫుల్.. ఇలాగే కొనసాగితే కష్టమే

By

Published : Apr 17, 2021, 8:47 PM IST

సాధ్యమైనంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్‌ రాజారావు సూచించారు. ఎవరికి వాళ్లు సొంతంగా లాక్‌డౌన్‌ విధించుకోవాలన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే గాంధీలో మిగతా సేవలు నిలుపుదల చేశామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం గాంధీలో ఐసీయూ సామర్థ్యం 350 పడకలే ఉన్నాయని తెలిపారు. నిన్న వచ్చిన కరోనా కేసులన్నీ ఐసీయూ అవసరమైనవేనని.. రాత్రంతా శ్రమించి పడకలు సర్దుబాటు చేశామని వెల్లడించారు. వైరస్ బాధితుల రాక ఇదేవిధంగా కొనసాగితే కష్టమేనంటున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెండ్‌ రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..

వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్న గాంధీ సూపరింటెండెండ్ రాజారావు..

ABOUT THE AUTHOR

...view details