ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంటల బీమా పథకం పేరు మార్పు.. ఉత్తర్వులు జారీ - ఏపీలో పంటల బీమా పథకం పేరు మార్పు

పంటల బీమా పథకం పేరును వైఎస్​ఆర్ ఉచిత పంటల బీమా పథకంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

free crop insurance scheme
free crop insurance scheme

By

Published : Nov 3, 2020, 4:25 PM IST

పంటల బీమాకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకుగానూ పేరు మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు ఇచ్చారు.

2019-20 సంవత్సరంలో రబీ సీజన్ కు.. అలాగే 2020 ఖరీఫ్ పంటకు అమలు అయ్యేలా పంటల బీమా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఉచిత పంటల బీమా వర్తింపజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details