ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లక్కీ డ్రా పేరిట మోసం.. ముఠా అరెస్ట్

బహుమతుల ఆశ చూపి.. అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచేస్తున్నారు మోసగాళ్లు. లక్కీ డ్రాల పేరిట అమాయకులను నిలువున ముంచేస్తున్నారు. ఇలాగే అక్రమాలకు పాల్పడిన ఓ ముఠాను తెలంగాణ జగిత్యాల రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

By

Published : Mar 16, 2021, 12:15 AM IST

లక్కీ డ్రా పేరిట మోసం.. ముఠా అరెస్ట్
లక్కీ డ్రా పేరిట మోసం.. ముఠా అరెస్ట్

తెలంగాణ జగిత్యాల జిల్లా మోతెలో లక్కీ డ్రా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల నుంచి నిందితులు.. రూ. లక్షకు పైగా దండుకున్నట్లు వారు గుర్తించారు.

నిర్వాహకులు.. వారానికి రూ.3వందల చొప్పున వసూలు చేస్తూ లక్కీ డ్రా నిర్వహించేవారు. తొలుత కొంత మందికి బహుమతులు ఇచ్చి.. రాను రాను మిగతా వారిని మోసం చేస్తూ దందా మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్‌ పోలీసులు.. లక్కీ డ్రా నిర్వహిస్తుండగా నిందితులను పట్టుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి:తల్లీ కుమార్తె హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details