ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్తమోడిన రహదారులు.. కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి - road accident news in krsihan district

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

four persons died in Road accident at Krishna district

By

Published : Nov 3, 2019, 10:39 AM IST

Updated : Nov 3, 2019, 3:19 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. హైదరాబాద్​ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు వేగంగా డివైడర్​ను ఢీకొని హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఎర్టిగా కారు ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించే మార్గంలో మృతి చెందారు. ఒకరు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల వివరాలు, వారి ప్రాంతాలు

  • నారాపోగు గోపయ్య- ఖమ్మం జిల్లా (తెలంగాణ)
  • భీం రెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)
  • మట్టపల్లి భీమ్ రెడ్డి (కర్ణాటక)
  • మన్సూర్ - హైదరాబాద్. ఇతను ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరికి చెందన వ్యక్తి కాగా.. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
  • విశ్రమ్ కోటేశ్వరరావు
Last Updated : Nov 3, 2019, 3:19 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details