ఒడిశాలోని కొరాఫుట్ జిల్లా కడం గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఒడిశా జర్సుగుడా బొగ్గు గనుల్లో పని చేసేవారిగా గుర్తించారు. విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలో ట్రాలీ ఆటో బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు.. విశాఖకు తరలింపు - కొరాఫుట్ జిల్లా కడం వద్ద రోడ్డు ప్రమాదం
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కడం గ్రామం సమీపంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.
road accident in koraput district odisha
TAGGED:
vishka latest news