ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు'

నిమ్మగడ్డ రమేశ్​‌కుమార్‌ను ఎస్​ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు.

By

Published : May 29, 2020, 1:33 PM IST

Published : May 29, 2020, 1:33 PM IST

Former minister Somireddy Chandramohan Reddy tweet to the High Court's verdict to continue the Nimmagadda Ramesh Kumar as SEC
Former minister Somireddy Chandramohan Reddy tweet to the High Court's verdict to continue the Nimmagadda Ramesh Kumar as SEC

హైకోర్టు తీర్పుపై సోమిరెడ్డి ట్వీట్

రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే... భంగపాటు తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీ రమేశ్​ కుమార్​ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో.. ఈ విషయం మరోసారి రుజువైందన్నారు.

కనగరాజ్​ను ఎస్​ఈసీగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ రోజే తాను చెప్పినట్లు సోమిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details