ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్​.రామచంద్రరావు కన్నుమూత - తెలంగాణ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.రామచంద్రరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి గుండెనొప్పితో తుదిశ్వాస విడిచారు. రామచంద్రరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ మాజీ ఏజీ ఎస్​.రామఆంధ్రప్రదేశ్​ మాజీ ఏజీ ఎస్​.రామఆంధ్రప్రదేశ్​ మాజీ ఏజీ ఎస్​.రామచంద్రరావు మృతిచంద్రరావు మృతిచంద్రరావు మృతి
ఆంధ్రప్రదేశ్​ మాజీ ఏజీ ఎస్​.రామచంద్రరావు మృతి

By

Published : Aug 21, 2020, 1:58 AM IST

Updated : Aug 21, 2020, 2:42 AM IST

ప్రముఖ సీనియర్​ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్​ మాజీ అడ్వకేట్​ జనరల్​ ఎస్​. రామచంద్రరావు గుండెపోటుతో మృతి చెందారు. 1947 సెప్టెంబర్ 1న జన్మించిన ఆయన... ఆంధ్రాయానివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. మద్రాస్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. సుప్రీం, హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు.

సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొఫెషనల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజును విజయవంతంగా సవాలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూశారు. తితిదే దేవస్థానానికి దాతల నుంచి వచ్చే సొమ్మును పక్క దారి పట్టకుండా న్యాయపరంగా కీలకంగా వ్యవహరించారు. ప్రజా ప్రయోజనాల కేసుల్లో వారికి న్యాయం జరిగేలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన మృతి పట్లు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Last Updated : Aug 21, 2020, 2:42 AM IST

ABOUT THE AUTHOR

...view details