అడవిపంది దాడిలో బాలునికి తీవ్ర గాయాలైన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్లో జరిగింది. పొలానికి వెళ్తున్న గంగాధర్ అనే బాలుడిపై అడవిపంది దాడి చేసింది. బాలుడిని కిందపడేసి నోటితో గాయపరిచింది.
తెలంగాణ: బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు - తెలంగాణ వార్తలు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తినగర్లో దారుణం జరిగింది. బాలుడిపై అడవి పంది దాడి చేసింది. అక్కడే ఉన్నవారు బాలుడిని రక్షించారు. కాని అప్పటికే అతనికి తీవ్రగాయలయ్యాయి. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ: బాలుడిపై దాడి చేసిన అడవి పంది.. రక్షించిన స్థానికులు
బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు
గమనించిన స్థానికులు అడవిపందిని రాళ్లతో కొట్టడంతో విడిచిపెట్టింది. గాయాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తరువాత అడవిపందిని కొట్టి చంపేశారు.
ఇదీ చదవండి:సమీకృత బస్టాండ్లపై ముందడుగు