ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: యాదాద్రిలో వింత చేప

By

Published : May 21, 2021, 8:33 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని మంగలిగడ్డ వద్ద చేపలు పడుతుండగా జాలర్లకు ఓ వింత చేప చిక్కింది. ఈ మత్స్యాన్ని డెవిల్ ఫిష్‌గా పిలుస్తుంటారని, ఇది ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని రైతులు తెలిపారు.

rare fish
rare fish

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జాలర్లకు వింత చేప చిక్కింది. మంగలిగడ్డకు చెందిన జింకల యాకయ్య అనే రైతు.. తన వ్యవసాయ బావిలో వల వేయగా.. ఈ చేప చిక్కింది. చేపపై నల్లటి మచ్చలు, ముళ్లు ఉన్నాయి. చేపకు కింది బాగంలో నోరు ఉంది. సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదని యాకయ్య తెలిపారు.

తన వ్యవసాయ భూమిలోంచి దేవాదుల కాల్వ వెళ్తుందని.. అందులోంచి వచ్చి ఉంటుందని చెప్పారు. ఈ వింత చేపను.. డెవిల్‌ ఫిష్‌గా పిలుస్తారని యాకయ్య వివరించారు. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని యాకయ్య తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం

ABOUT THE AUTHOR

...view details