ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2020, 4:15 PM IST

Updated : Nov 3, 2020, 4:46 PM IST

ETV Bharat / city

భారీ ప్రమాదం: నిలిపి ఉన్న బోగీల్లో అగ్ని కీలలు

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ రైల్వే స్టేషన్​లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలంగా నిలిపి ఉన్న బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

fire accident in medchal railway station
మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ రైల్వే స్టేషన్​లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలంగా నిలిపి ఉన్న బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

పరిమిత రైలు సర్వీసుల వల్ల కొన్నేళ్లుగా ఈ బోగీలు నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారా? లేదా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే శాఖ ఆరా తీస్తోంది.

ఇదీ చూడండి:విషాదం... పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

Last Updated : Nov 3, 2020, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details