ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూ-1 జోన్​ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన

రాజధాని ప్రాంతం తాడేపల్లిలో విధించిన యూ1(రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ వైకాపా హామీ ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

By

Published : Apr 14, 2021, 4:36 PM IST

యూ 1 జోన్
రాజధాని అమరావతి ప్రాంతం

యూ -1 జోన్​ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధించిన యూ-1 (రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్​ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్​ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details