ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : నిరుద్యోగులే టార్గెట్... అక్రమార్జనే ధ్యేయం

ఇంటర్ కూడా పాస్ కాలేదు. కానీ డీఎస్పీ (Fake Dsp) అయ్యాడు. ఒక డీఎస్పీకి కావలసిన అన్ని వసతులు కల్పించుకున్నాడు. గుర్తింపు పొందిన ఫేక్ ఐడీ కార్డులు సృష్టించాడు. ఓ కారును కూడా మెయింటెన్ చేస్తున్నాడు. అదే కారులో వెళ్లి తాను డీఎస్పీని అంటూ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. సెటిల్​మెంట్లకూ పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడం వల్ల నకిలీ డీఎస్పీగా కొనసాగుతున్న కేటుగాడి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.

By

Published : Jul 17, 2021, 7:19 PM IST

తెలంగాణ : నిరుద్యోగులే టార్గెట్... అక్రమార్జనే ధ్యేయం
తెలంగాణ : నిరుద్యోగులే టార్గెట్... అక్రమార్జనే ధ్యేయం

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్​పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి (Nellore Swami) ఇంటర్ కూడా పాస్ కాలేదు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ కోట్లు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తన ప్లాన్​కు పోలీస్ ఉద్యోగం అయితేనే కరెక్ట్ అనుకున్నాడు. అంతే.. ఓ డీఎస్పీ స్థాయి సూట్ రెడీ చేసుకున్నాడు. గుర్తుపట్టకుండా గుర్తింపు పొందిన నకిలీ ఐడీ కార్డులు సృష్టించాడు.

తన కారుకు పోలీస్ స్టిక్కర్ వేసి రోడ్లపై తనిఖీలు మొదలుపెట్టాడు. ఇసుక టిప్పర్లు, ఇతర సెటిల్​మెంట్లు చేయడం ప్రారంభించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో అంతా మన వాళ్లే ఉన్నారంటూ గాలం వేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేశాడు.

కోటి వరకు వసూల్...

ఇలా తన ముఠాతో కలిసి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 5 నుంచి 10 లక్షల చొప్పున సుమారు కోటి వరకు వసూలు చేశాడు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి.. బీబీపేట, తుజాల్​పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల మాదిరి విధులు నిర్వహిస్తూ మరి వసూళ్లకు పాల్పడేవాడని ఆరోపణలున్నాయి.

అడ్డూ అదుపులేని అక్రమాలు...

తుజాల్​పూర్ గ్రామంలో ఉండే కూడేల్లి వాగు నుంచి వెళ్లే ఇసుక ట్రాక్టర్లను, టిప్పర్లు టార్గెట్ చేసుకొని స్వామి డీఎస్పీ వసూళ్లకు పాల్పడేవాడు. విషయం తెలిసిన పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామికి స్థానికంగా ఉండే ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి భార్య అక్క కొడుకుల అండ ఉండడం వల్ల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వామిపై అనుమానం వచ్చిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది.

బరిలోకి స్పెషల్ పార్టీ...

బేగంబజార్ పోలీస్ స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు స్వామి పోలీస్ కాదని తేల్చారు. నకిలీ పోలీస్ నెల్లూరు స్వామిని పట్టుకునేందుకు బేగంబజార్ స్పెషల్ పార్టీ పోలీసులు మూడు రోజులుగా బీబీపేటలో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో ఈనెల 14 బుధవారం రాత్రి స్వామిని అతని ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పాస్ కాని వ్యక్తి డీఎస్పీగా ఇన్ని రోజులు చెలామణి అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. స్థానిక పోలీసులు కూడా అతనితో పార్టీలకు వెళ్లేవారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: ASHOK GAJAPATHI RAJU:'మాన్సాస్ ట్రస్ట్​లో ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'

ABOUT THE AUTHOR

...view details