ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమెరికా ఫలితాలు ఇప్పుడే తేలవు: ప్రొ.కృష్ణకుమార్

By

Published : Nov 4, 2020, 10:57 PM IST

Updated : Nov 5, 2020, 3:32 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతోన్న కొద్దీ ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎలక్టోరల్ ఓట్లలో ప్రస్తుతానికి బైడెన్​ ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. అయితే ఈ ఉత్కంఠకు ఇప్పుడే తెరపడే అవకాశాలు లేవంటున్నారు ప్రవాస భారతీయుడు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కృష్ణ కుమార్ తుమ్మల. అమెరికాలో ఉంటున్న ఆయన... ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

american election
american election

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రత్యర్థి జో బైడెన్‌ల మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరి సొంతమవుతుందోనని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా.. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.

అయితే రెండు, మూడు రోజులైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలే అవకాశం లేదంటున్నారు అమెరికాలోని రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ప్రొ. కృష్ణ కుమార్ తుమ్మల. లక్షలాది ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉన్నందున్న ఫలితాలపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా భారత్​తో స్నేహ బంధాల విషయంలో పెద్దగా ఏ మార్పు ఉండదని అభిప్రాయపడ్డారు.

ప్రొ. కృష్ణ కుమార్ తుమ్మల ఇంటర్వూ
Last Updated : Nov 5, 2020, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details