ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవకతవకలకు పాల్పడిన ఎక్సైజ్ అధికారులపై చర్యలు' - ఎక్సైజ్ పోలీసులు సస్పెన్షన్

ఏడు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ మంత్రి నారాయణస్వామి సమావేశమయ్యారు. బెల్టు షాపుల నియంత్రణ, మద్యం ఔట్​లెట్ల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. బెల్టు షాపులను ప్రోత్సహిస్తోన్న ఎక్సైజ్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

Excise minister review on liquor policy
ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణస్వామి సమావేశం

By

Published : Feb 14, 2020, 10:56 PM IST

ఏడు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ మంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల డీసీలు, ఏసీలు, డీఎంలతో ఆయన భేటీ అయ్యారు. బెల్టు షాపుల నియంత్రణ, మద్యం ఔట్​లెట్ల నిర్వహణపై చర్చించారు. కొందరు అధికారులే బెల్టు షాపులను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులను ప్రోత్సహిస్తోన్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భుజంగరావును సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బార్లకు మద్యం సరఫరా చేశారనే ఆరోపణలు నిర్ధారణ అవ్వడం వల్ల సీఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై గుంటూరు జిల్లా డీసీ ఆదిశేషుకు ఛార్జ్ మెమో జారీ చేయాలన్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎక్సైజ్ సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మద్యపాన నిషేధంలో భాగంగా కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.

అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. సూపర్​వైజర్, సేల్స్​మెన్, వాచ్​మెన్లకు ఏజెన్సీల ద్వారా జీతాలు సక్రమంగా ఇవ్వాలన్నారు. ఐడీ, ఎన్డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోండి'

ABOUT THE AUTHOR

...view details