ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొల్లు రవీంద్ర బెయిల్​ పిటిషన్​ విచారణ వాయిదా - ex minister Kollu Ravindra bail petition news

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్​పై కృష్ణా జిల్లా కోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ex minister  Kollu Ravindra
ex minister Kollu Ravindra

By

Published : Aug 17, 2020, 6:19 PM IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్​పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. వైకాపా నాయకుడు హత్య కేసులో నిందితునిగా రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్న కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌పై.. ఇవాళ కృష్ణా జిల్లా కోర్టులో విచారణ జరిగింది.

రాజమండ్రి జైలులో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది వెంకటేశ్వరరావు కోరారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కళ్యాణి తమ వాదనలు వినిపిస్తూ... జైలులో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి... జైలులో కరోనా పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సూచిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details