ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములు లాక్కుంటున్నారు: జవహర్

By

Published : Jul 5, 2020, 7:35 PM IST

ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం దళితుల భూములను లాక్కుంటోందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములన్నీ వైకాపా నేతలవేనని ఆరోపించారు.

ex-minister-jawahar
ex-minister-jawahar

వైకాపా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడికి పాల్పడుతోందని.. దళితుల భూములు లాక్కుంటోందని మాజీ మంత్రి జవహర్ అన్నారు ఇళ్ల పట్టాల కోసం సేకరించే భూముల కొనుగోళ్లలో వైకాపా నాయకులు 1600 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 690 కోట్ల రూపాయల అవినీతి జరగిందని.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 183 కోట్ల కుంభకోణం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములన్నీ వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులవేనని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details