ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Jan 20, 2021, 11:01 AM IST

Updated : Jan 20, 2021, 11:27 AM IST

top news
టాప్ న్యూస్

  • పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని

పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. దిల్లీ వెళ్లి జగన్‌ ఏం సాధించారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్వయంగా మంత్రే పేకాట ఆడిస్తున్నారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. నిజాలు మాట్లాడిన పట్టాభిపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భీమడోలు మండలం పూళ్లలో 27కు చేరిన బాధితులు

భీమడోలు మండలం పూళ్లలో అంతుచిక్కని వ్యాధి కలవర పెడుతోంది. బాదితుల సంఖ్య 27కు చేరింది. కొందరు కళ్లు తిరిగి ఆస్పత్రిలో చేరుతున్నారు. చికిత్స తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్తున్నారు. ఏలూరు తరహా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నందున వైద్యశాఖ అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుపతి పార్లమెంటరీ తెదేపా కార్యాలయం ప్రారంభం

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా కార్యాలయం ప్రారంభమైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఆన్​లైన్​లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా మహమ్మారితో మహిళలకు కొత్త కష్టాలు

ఉరుకులు పరుగుల జీవితంలో మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు ఒక మజిలీగా కరోనా లాక్​డౌన్ ను భావించారు చాలామంది. అయితే గణాంకాలు మాత్రం మహిళల విషయంలో లాక్​డౌన్ ప్రతికూల ప్రభావం చూపిందంటున్నాయి. పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమైన వేళ.. మల్టీ టాస్కింగ్​ పేరుతో మహిళలు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఇంత చేసినా ఫలితం శూన్యం. వారిపై మానసికంగా, శారీరకంగా హింస పెరిగిపోయిందనే లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గుజరాత్​లో డ్రాగన్​ పేరు ఇక 'కమలం'

గుజరాత్​లో డ్రాగన్ పండు​ పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ. దానికి 'కమలం' అని నామకరణం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాభాల జోరు- 49 వేల 500 ఎగువన సెన్సెక్స్​

బుధవారం సెషన్​లో భారీ లాభాలను నమోదుచేసిన దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు నేడూ సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. 49,500కి ఎగువన సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • జాతి ఐక్యతా ప్రసంగానికి ముందు బైడెన్​​ భావోద్వేగం

అగ్రరాజ్య అధ్యక్షుడిగా బైడెన్​ మరికొద్ది గంటల్లో ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఆయన తన సొంత రాష్ట్రమైన డెలావేర్​ నుంచి బయలుదేరారు. ప్రమాణ స్వీకార అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. అంతకుముందు డెలావేర్​లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ బైడెన్​ భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • థాయ్​ ఓపెన్​: ప్రణీత్​కు కరోనా.. శ్రీకాంత్​​ ఔట్​

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొన్న భారత స్టార్​ షట్లర్​ సాయి ప్రణీత్​కు కరోనా సోకింది. దీంతో అతడు టోర్నీ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. పది రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నాడు. అతడితో సన్నిహితంగా ఉన్న కారణంగా.. కిదాంబి శ్రీకాంత్​ కూడా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నాలుగు రోజుల్లోనే లాభాలు: 'రెడ్​' నిర్మాత

సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాలను పొందామని అంటున్నారు 'రెడ్​' చిత్ర నిర్మాత స్రవంతి రవికిశోర్​. కరోనా సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రేక్షకుల నుంచి స్పందన లభించిందని చెప్పారు. మంచి కథ దొరికితే రామ్​తో ఓ పాన్​ఇండియా మూవీని నిర్మిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jan 20, 2021, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details