ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : May 8, 2021, 11:00 AM IST

Updated : May 8, 2021, 11:05 AM IST

etv bharath top news
etv bharath top news

  • రెండో డోస్: వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూ

కొవిడ్ రెండో డోస్ టీకా కోసం ప్రజలు బారులుతీరారు. ఉదయం 6 గంటల నుంచే.. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ప్రకాశం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో సెకండ్ డోస్ కోసం పెద్దసంఖ్యలో వచ్చారు. రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిలకలూరిపేట చిన్నారి ప్రతిభ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు!

చిల‌క‌లూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి బాలిక ఫజీలా.. గిన్నిస్‌ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సొంతం చేసుకుంది. ర‌సాయ‌న శాస్త్రంలో ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌లోని మూల‌కాల‌ను తక్కువ సమయంలో పేర్చ‌టంలో ఫజీలా ఈ అవార్డు సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆక్సిజన్‌ సిలిండర్ల అక్రమ నిల్వల గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్

అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేస్తూ బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న వ్యక్తిని విశాఖ ఔషధ నియంత్రణ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడు జగదీష్ కుమార్​పై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో 4లక్షల కరోనా కేసులు- 4వేల మరణాలు

దేశంలో కరోనా తీవ్రత ఆందోళకరంగా మారింది. తాజాగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. మరోసారి రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్​ ఉన్నా.. ముంబయికి పోటెత్తున్న వలస కార్మికులు

అసెంబ్లీ ఎన్నికలు, హోలీ వేడుకలు, కరోనా వంటి పలు కారణాలతో మహారాష్ట్ర నుంచి వెళ్లి పోయిన వలస కార్మికులు.. తిరిగి ముంబయి బాట పట్టారు. ఆ రాష్ట్రంలో కఠిన లాక్​డౌన్​ అమల్లో ఉన్నా.. రైళ్ల ద్వారా రోజుకు సుమారు 50వేల మంది వాణిజ్య నగరానికి చేరుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తమిళనాడులో పూర్తిస్థాయి లాక్​డౌన్

కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్​డౌన్ తరహా ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి 24 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెరిగిన నిరుద్యోగం.. సమర్థించుకున్న బైడెన్

అమెరికాలో నిరుద్యోగం మరింత పెరిగింది. కొత్తగా పది లక్షల ఉద్యోగాలు వస్తాయని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే ఆ దేశ కార్మికశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం అవి కేవలం 2లక్షల 66 వేలకు మాత్రమే పరిమితం అయినట్లు స్పష్టం అయ్యింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్​ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం మూడు నెలల్లో పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వ్యయం పెరిగితేనే ఆర్థికానికి ఊపు

కరోనా రెండో దశ విజృంభణ- ఆర్థిక వృద్ధి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారతదేశ జీడీపీకి అత్యధిక వాటాను అందించే పారిశ్రామిక రాష్ట్రాల్లో కొవిడ్‌ దెబ్బకు పాక్షిక లాక్‌డౌన్‌లు విధించడం దేశ జీడీపీని కుంగదీయనుంది. ఈ గడ్డు పరిస్థితుల్లో పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీని అత్యవసరంగా పునరుద్ధరించాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఐపీఎల్​ నిర్వహణకు శ్రీలంక రెడీ'

ఐపీఎల్-14 రెండో అంకానికి అతిథ్యమిచ్చేందుకు శ్రీలంక ఆసక్తి చూపింది. ఈమేరకు బీసీసీఐ అనుమతించాలని శ్రీలంక క్రికెట్ కమిటీ ఛీఫ్ అర్జున డిసిల్వ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమేద్దాం'

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సందేశం ఇచ్చారు నటుడు విజయ్ దేవరకొండ. భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : May 8, 2021, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details