ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

.

By

Published : Apr 30, 2021, 11:01 AM IST

11 am top news
టాప్ టెన్ న్యూస్

  • 'అమరావతి ఉద్యమ భేరి' వర్చువల్‌ సభ

అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి అన్నదాతల ఉద్యమం 500వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఉద్య భేరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.లైవ్ కోసం క్లిక్ చేయండి.

  • రైతులు, మహిళలకు అంతిమ విజయం దక్కాలి: చంద్రబాబు

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలను అవమానించినందుకే రాష్ట్రంలో ఇన్ని ఉపద్రవాలన్నీ తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని ఉద్యమంలో మహిళలు, రైతులు అంతిమంగా విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాతో తితిదే డిప్యూటీ ఈవో మృతి

కొవిడ్​తో తితిదే డిప్యూటీ ఈవో కె. నాగరాజు మృతి చెందారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో డిప్యూటీ ఈవోగా నాగరాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో మరో 3 లక్షల 86 వేల కరోనా కేసులు

దేశంలో కొవిడ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కొత్తగా 3,86,452 మంది వైరస్​ బారిన పడ్డారు. 2 లక్షల 97 వేల మందికిపైగా వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కడుపులో 2 కిలోల కొకైన్- ఇద్దరు అరెస్ట్​

కడుపులో మాదకద్రవ్యాలను పెట్టుకుని, అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు టాంజానియా జాతీయులను ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శస్త్ర చికిత్స అనంతరం సుమారు 2కిలోల కొకైన్​ను వీరి కడుపు నుంచి బయటకు తీశారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందరికీ అందుబాటులో ఔషధాలు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 65 శాతం భారతీయులు ఆధునిక వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించేందుకు కేంద్రం.. జన్ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఔషధాల సరఫరా సక్రమంగా జరగకపోవడం, ప్రజలకు వీటిపై అవగాహన కల్పించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 300 మైనస్​

స్టాక్​ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • రెండోసారి గాల్లోకి ఎగిరిన అతిపెద్ద విమానం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి గాల్లోకి ఎగిరింది. అమెరికాలోని కాలిఫోర్నియా మొజావ్‌ ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్‌ నుంచి ఎగిరిన విమానం.. 3 గంటల విహారం అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండ్​ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ బయోబబుల్​ సురక్షితం: జంపా

ఐపీఎల్ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్​ సురక్షితం కాదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు ఆస్ట్రేలియా, ఆర్సీబీ క్రికెటర్​ ఆడమ్​ జంపా. వైరస్​ ఏ దశలోనూ బయోబబుల్​లోకి చేరదని.. అలాంటి ఏర్పాట్లు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజీలు చేశాయని తెలిపాడు. ఈసారి కూడా ఐపీఎల్​ను చివరివరకు చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యూట్యూబ్​ను షేక్ చేస్తున్న టాలీవుడ్​ టీజర్లు!

బాలకృష్ణ 'అఖండ' టీజర్​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. 50 మిలియన్ల మార్క్​ను అందుకుని సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఎక్కువ వీక్షణలు సొంతం చేసుకున్న టీజర్లు ఏంటి? వాటికి ప్రస్తుతం ఎన్ని వ్యూస్​ ఉన్నాయో చూసేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details