ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 31, 2020, 7:00 PM IST

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 pm

.

7pm top news
7 pm ప్రధాన వార్తలు

  • రాష్ట్రంపై కరోనా కోరలు
    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో (9ఏఎం- 9పీఎం) రాష్ట్రవ్యాప్తంగా 10,376 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పంతం నెగ్గించుకున్న ప్రభుత్వం
    వివిధ మలుపులు తిరిగిన సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్​ ఆమోదం వేశారు. కొన్ని నెలలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువైందీ బిల్లు. రెండుసార్లు సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోలేకపోయిన ప్రభుత్వం... బంతిని గవర్నర్​ కోర్టులోకి నెట్టేసి ఆయన ద్వారా విజయం సాధించింది. కొన్ని నెలలుగా సాగిన వివాదంలో ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • గవర్నర్ తీరుకు నిరసనగా తుళ్లూరులో రైతుల ధర్నా
    రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రహదారిపై బైఠాయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అవి ప్రభుత్వ హత్యలే
    ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృతి చెందిన ఘటనపై నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం పాలసీ, విషం లాంటి బ్రాండ్ల అమ్మకం.. ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని విమర్శించారు. మృతుల కుటుంబాలకు 50 ల‌క్షల రూపాయలు చొప్పున న‌ష్టప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కల్తీ మద్యం కాటుకు 21 మంది బలి
    పంజాబ్​లో కల్తీ మద్యం సేవించడం వల్ల 21 మంది చనిపోయారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​ తక్షణమే విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
    కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ). ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?
    ప్రపంచవ్యాప్తంగా హై-ప్రొఫైల్​ వ్యక్తుల ట్విట్టర్​ హ్యాకింగ్​పై ఆ సంస్థ మరిన్ని వివరాలు వెల్లడించింది. ఫోన్​ ద్వారా తమ సంస్థ ఉద్యోగులను హ్యాకర్లు మోసం చేసి సున్నితమైన సమాచారాన్ని కాజేశారని తెలిపింది. ఇందుకు 'ఫోన్​ స్పియర్ ఫిషింగ్' సాంకేతికతను ఉపయోగించారని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.!
    కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొవిడ్​ మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్​ను కనిపెట్టే దిశగా ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 150 టీకాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి ఆయా దేశాలు. మరో 25 టీకాలు మానవ ప్రయోగ దశలో ఉన్నాయి. ఇంకా ఏయే దేశాల ప్రయోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
  • దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లకు అప్పటినుంచి శిక్షణ​!
    ఆగస్టు 15 నుంచి భారత ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది దిల్లీ క్యాపిటల్స్. అయితే ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ పాలకమండలి భేటీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మద్రాస్​ హైకోర్టులో కోహ్లీ, తమన్నాలపై పిటిషన్!
    ఆన్​లైన్​లో జూదం యాప్​లకు యువత చెడిపోతున్నారని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ఓ న్యాయవాది. వాటికి ప్రచారం చేస్తున్న కోహ్లీ, తమన్నాలతో పాటు సదరు సంస్థలపై పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details