ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చ - ERC latest news

సౌర, పవన విద్యుత్ కొనుగోలు, ఒప్పందాలపై ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి సమీక్ష నిర్వహించింది. సచివాలయంలోని మొదటి బ్లాక్​లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈఆర్​సీ ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి... విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఈఆర్​సీ సభ్యులు హాజరయ్యారు. విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ హాజరై ఈఆర్​సీకి వివరాలు అందించారు.

ERC Review on solar and wind power in AP
గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చ

By

Published : Feb 21, 2020, 5:07 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు కోసం చేసుకున్న ‌ఒప్పందాలు, ధరల చెల్లింపు, ఒప్పంద కాలావధి తదితర అంశాలను ఈఆర్​సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సౌర విద్యుత్ పవర్ ప్రాజెక్టుల ఒప్పందాల్లో భాగంగా... ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన విద్యుత్, ఎప్పటినుంచి కొనుగోళ్లు నిలిపివేశారన్న వివరాలను నమోదు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్న అంశాలపై సమావేశంలో చర్చించారు. 10 వేల మెగావాట్ల సామర్ధ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్​ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన వనరులు, సమగ్ర రూపకల్పన తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండీ... రాజధానిగా అమరావతే ఉండాలి:డి.రాజా

ABOUT THE AUTHOR

...view details