తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కార్వీ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు(ED raids on Karvy office). మనీలాండరింగ్ కేసులో కార్వీ ఛైర్మన్ సహా పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఈడీ అధికారులు ఇవాళ కార్వీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కార్వీ కుంభకోణం కేసులో అరెస్టు అయిన వారిని కూడా ఈడీ విచారించింది.
మరోవైపు ఈ కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథిని బెంగుళూరు పోలీసుల కస్టడీకి హైకోర్టు నిలిపివేసింది. ముందుగా నాంపల్లి కోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని విన్నవించారు. పరిశీలించిన ధర్మాసనం.. పీటీ వారెంట్ను రద్దు చేసింది. సెప్టెంబర్ 8న బెంగళూరులోని శేశాద్రిపురం పోలీస్ స్టేషన్లో పార్థసారథిపై కేసు నమోదైంది. 109 కోట్ల రూపాయల మోసం కేసులో పార్థసారిథితో పాటు కార్వీ సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్వో కృష్ణహరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే బెంగళూరు పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.