ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్యాలయాలు తరలించొద్దు : సచివాలయ ఉద్యోగులు - taaza news on sachivalaya employees

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సచివాలయ ఉద్యోగులు కలిశారు. విజిలెన్స్ కమిషనర్, కమిషనర్​ ఆఫ్ విజిలెన్స్‌ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించవద్దని విజ్ఞప్తి చేశారు.

employees meet with ap cs
కార్యాలయాలను తరలించవద్దు... సీఎస్​తో సచివాలయ ఉద్యోగులు

By

Published : Feb 5, 2020, 7:20 AM IST

కార్యాలయాలను తరలించవద్దు... సీఎస్​తో సచివాలయ ఉద్యోగులు

విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం సహా.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యకలాపాలను కర్నూలుకు తరలించొద్దంటూ ఆ విభాగపు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ నీలం సాహ్నికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ 2 విభాగాలూ సాధారణ పరిపాలన శాఖలో భాగమని నివేదించారు. ప్రతి శాఖకు చెందిన వివరాలు విజిలెన్స్ కమిషన్‌కు చేరవేయాల్సి ఉంటుందన్న ఉద్యోగులు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ రెండు విభాగాలనూ అన్ని శాఖలతో కలిపి సచివాలయ పరిధిలోనే ఉంచాలని నివేదించారు. అయితే ఈ రెండు విభాగాలు జ్యుడీషయల్ పరిధిలో ఉన్నందునే కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఉద్యోగులకు సీఎస్ తెలిపారు. ఈ అంశంపై మరోసారి అధ్యయనం చేసి రెండు శాఖలూ సచివాలయం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి-'అమరావతి కోసం 25 గుండెలు ఆగినా మీరు స్పందించరా..?'

ABOUT THE AUTHOR

...view details