ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2020, 12:49 PM IST

ETV Bharat / city

తెలంగాణ: వెలువడుతున్న ఫలితాలు.. బోణి కొట్టిన మజ్లిస్

గ్రేటర్ పోరు ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మజ్లిస్ ఓ స్థానంలో బోణి కొట్టగా.. చాలా చోట్ల తెరాస ముందంజలో ఉంది. మరో రెండు గంటల్లో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది.

emerging-first-round
emerging-first-round

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మెహదీపట్నంలో ఎంఐఎం బోణి కొట్టింది. ఈ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గెలుపొందారు.

ఆధిక్యాల్లో అత్యధికం పోస్టల్ ఓట్ల ఫలితాలే ఉన్నాయి. ఇప్పుడే తొలి రౌండ్ ఫలితాలు ప్రారంభమయ్యాయి. బాలాజీనగర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్‌, శేరిలింగంపల్లి డివిజన్లలో తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యంలో ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల తొలి రౌండ్‌లో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మరో 2 గంటల్లో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details