దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు తేదీలు ప్రకటించిన నేపథ్యంలో... రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు.. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని.... 22 జూన్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు.
రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు.. 19న అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ - ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు న్యూస్
రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
![రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు.. 19న అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ Elections for 4 rajya sabha seats in AP on 19th june](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7452647-771-7452647-1591136040927.jpg)
Elections for 4 rajya sabha seats in AP on 19th june