ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పరీక్షలో సుమారు 77 శాతం మేర హాజరు నమోదైనట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని గోవర్ధన్ స్పష్టం చేశారు. గురు, శుక్రవారాలతో సహా ఈనెల 14న రోజుకు రెండు సెషన్లలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్నట్లు పేర్కొన్నారు.
'ఉష్ణోగ్రత తగ్గాకే పరీక్ష రాయండి'
ఇద్దరు విద్యార్థులకు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడంతో... అధికారులు వెనక్కి పంపించారు. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత పరీక్ష రాయాలని సూచించారు. తమకు కరోనా పాజిటివ్ ఉందని.. ఐదారుగురు విద్యార్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు చేయడం గమనార్హం.
విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటాం..