ఘాట్లు,కేశఖండన శాలకుఅనుమతి లేదు
దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రూ.4 కోట్ల వ్యయంతో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. మల్లికార్జున మహామండపంలో బుధవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఈవో సురేష్బాబు, సభ్యులతో కలిసి ఛైర్మన్ విడుదల చేశారు. ఉత్సవాలపై సమీక్షించారు. అనంతరం సోమినాయుడు మాట్లాడుతూ.. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో టిక్కెట్లు తీసుకున్న భక్తులను మాత్రమే క్యూలైన్లోకి అనుమతిస్తారని చెప్పారు. 21న మూలా నక్షత్రం నాడు సంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, దేవదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. దసరా ఏర్పాట్లకు సంబంధించి 37 అంశాలపై పాలకమండలి సమావేశం చర్చించింది. 35 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఒక అంశాన్ని తిరస్కరించి, మరో అంశాన్ని తదుపరి సమావేశంలో చర్చించేందుకు వాయిదా వేసినట్లు ఛైర్మన్ తెలిపారు.
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పాలకమండలి
ఛైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్బాబు, సభ్యులు
తిరస్కరణ
*● కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరోక్ష ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, కుంకమ ప్రసాదం పోస్టలు విభాగం ద్వారా బట్వాడా చేసే ప్రతిపాదనను సభ్యులు తిరస్కరించారు.
*● భక్తుల సెల్ఫోన్ల భద్రపరిచే టెండరుపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఆమోదం పొందిన తీర్మానాలు