అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐబీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హోం మంత్రి సుచరిత కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ మధ్య కాలంలో సచివాలయంలో కొంత మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హోం మంత్రి సుచరితకు కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు - హోం మంత్రి సుచరిత తాజా వార్తలు
కరోనా మహమ్మారి కారణంగా అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. ఎమ్మెల్యేలందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తోంది.

హోం మంత్రి సుచరితకి కరోనా నిర్ధరణ పరీక్షలు
Last Updated : Jun 15, 2020, 11:44 PM IST