దిశ అత్యాచార ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. సినిమా చిత్రీకరణ, విడుదలను ఆపాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కమిషన్ వద్ద విచారణ పెండింగ్లో ఉండగా సినిమా తీయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సినిమా తమ కుటంబాన్ని మనోవేదనకు గురి చేసేలా కనిపిస్తోందని.. ట్రైలర్పై యూట్యూబ్లో ఉన్న కామెంట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాదించారు.
ఈ విషయం సెన్సార్ బోర్డు దృష్టికి రాలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తెలిపారు. అభ్యంతరాలను సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని దిశ తండ్రికి హైకోర్టు సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.