రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆక్సిజన్ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారన్న దేవినేని ఉమ... తన చుట్టూ ఉన్న అధికారులు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని వివరించారు. ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారు: దేవినేని ఉమ - Devineni Uma CID case
ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత దేవినేని ఉమ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారని వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమ
Last Updated : May 4, 2021, 12:40 PM IST