ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోకపోతే.. ఆదేశాలిస్తాం: తెలంగాణ హైకోర్టు - Telangana corona news

రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Telangana high court on corona
Telangana high court on corona

By

Published : Apr 19, 2021, 6:01 PM IST

Updated : Apr 19, 2021, 6:10 PM IST

రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం అన్నివిధాలుగా పర్యవేక్షిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి వివరించగా.. పర్యవేక్షణ కాదు, చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.

అత్యవసర బృందాలు ఏర్పాటు చేశారా..?

కరోనాపై ప్రజలకు అన్నీ తెలిసిపోయాయని.. ప్రభుత్వానికే తెలియాలని వ్యాఖ్యానించింది. రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని.. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల విషయంలో చర్యలేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నింపలేకపోతోందన్న హైకోర్టు.. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? అని వివరణ కోరింది.

మరింత గడువు కావాలి: ఏజీ

కుటుంబమంతా కరోనా బారినపడితే ఏ విధంగా సాయం చేస్తున్నారన్న హైకోర్టు.. ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రోజులు సరిపోవు.. మరింత సమయం కావాలని ఏజీ కోరగా.. మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగతాది తాము చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

Last Updated : Apr 19, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details