ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 23, 2022, 3:31 PM IST

ETV Bharat / city

పెళ్లికి వయసేంటి.. మనసే ముఖ్యమని కొటేషన్ చెప్పింది.. క్లైమాక్స్ ఏంటో తెలుసా?

Cyber Crime: ఓ వ్యక్తి వయసు 50 ఏళ్లు.. రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఇందుకోసం మ్యాట్రిమోని సంస్థను ఆశ్రయించాడు.. ఈ విషయం తెలుసుకుందో కి"లేడి". డైరెక్టుగా టచ్ లోకి వెళ్లింది. తన వయసు కేవలం 25 సంవత్సరాలు అని చెప్పిన యువతి.. అయినా డోన్ట్ కేర్.. వయసు అనేది జస్ట్ నంబర్.. పెళ్లికి కావాల్సింది మనసు మాత్రమే అని కొటేషన్లు చెప్పింది. ఇంకేముంది.. అతగాడు ప్యార్ మే పడిపోయాడు. మరి, ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ప్రీ వెడ్డింగ్ లవ్ స్టోరీ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ క్రైమ్ కహానీ చదివేయాల్సిందే.

Cyber Cheating
సైబర్ కి'లేడి'

Cyber Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోని జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో నివాసముండే 50 ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మ్యాట్రిమోని సైట్‌లో తన ప్రొఫైల్‌ పెట్టారు. ఇది జరిగిన రెండో రోజే ఓ అమ్మాయి డీపీతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దానికి అంగీకరించారు. మీరు నచ్చారు. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు చెప్పి ఫీజు కట్టాలని, కొవిడ్‌ వచ్చిందని.. ఇలా పలు కారణాలతో మొత్తం రూ.46 లక్షలు లాగేసింది. ఆ తర్వాత.. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని రూ.10.50 లక్షలు:కవాడిగూడకు చెందిన తోడల్లుళ్లు తమ ఇద్దరి పిల్లలకు నీట్‌లో మంచి ర్యాంక్‌ రాక ఎంబీబీఎస్‌ సీటు దక్కలేదు. మీ పిల్లలకు రాయ్‌చూర్‌లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నమ్మించాడు. దీంతో తోడల్లుళ్లు రెండు సీట్లకు రూ.10.50లక్షలు పంపించేశారు. మరుసటి రోజే రాయ్‌చూర్‌లోని ఓ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినట్లుగా లెటర్లు వచ్చాయి. అక్కడకు వెళ్లగా నకిలీవని తేలింది. బాధితులు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details