ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టి... రూ.లక్ష దండుకున్నారు

By

Published : Jun 30, 2020, 12:52 PM IST

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్న బాధితులు లక్షలు సమర్పించుకుంటున్నారు. తాజాగా ఓఎల్​ఎక్స్​లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు అమ్ముతామంటూ కేటుగాళ్లు ముగ్గురిని బురిడీ కొట్టించారు. లక్షల సొమ్ము కాజేశారు.

cyber-cheating-at-hyderabad
సైబర్ నేరగాళ్లు.. సొమ్మును దోచేస్తున్నారు

ఓఎల్ఎక్స్​లో తక్కువ ధరకే టూ వీలర్ వాహనాల అమ్మకం అన్నఫొటోలు చూసి సంప్రదించిన తెలంగాణలో హైదరాబాద్​కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. వాహనం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని షరతు పెట్టి.. చివరికి పంగనామం పెట్టారు. మోసాన్ని గ్రహించలేని బాధితులు ఆన్​లైన్​ ద్వారా రూ. 1.50 లక్షలు ట్రాన్స్​ఫర్​ చేశారు. వాహనం రాకపోవడం వల్ల సంబంధిత నెంబర్​ను సంప్రదించగా స్పందన లేదు. ఫలితంగా మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్​ సీసీఎస్​ సైబర్​క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు.

మరో రెండు కేసుల్లో ఓటీపీ పేరుతో ఇద్దరు వ్యక్తుల అకౌంట్​ నుంచి 1.30 లక్షలు, లోన్​ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.55 వేలు కాజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 కేసులపై సైబర్​ క్రైమ్​ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇదీచూడండి: అనవసర సైట్లు ఓపెన్​ చేస్తే అంతే.. : ఏసీపీ హరినాథ్

ABOUT THE AUTHOR

...view details