ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆహార పదార్థాలకు ప్రతిరోజూ పరీక్ష..! - సుజాతారావు కమిటీ తాజా వార్తలు

పబ్లిక్ హెల్త్ చట్టాన్ని తప్పక పాటించేందుకు చర్యలు తీసుకోవాలని... సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. బయట విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను నిత్యం పరీక్షించాలని సూచించారు.

సీఎస్

By

Published : Nov 1, 2019, 6:36 PM IST

ప్రాథమిక ఆరోగ్య సేవల పటిష్ఠంపై సుజాతారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించిన... సిఫార్సుల గురించి సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షించారు. కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హోటళ్లు, ఫుడ్ ఎస్టాబ్లిష్​మెంట్​లలో... ఆహార పదార్థాల నమూనాలు రోజూ పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నీటి నమూనాలూ సేకరించి పరీక్షించాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ చట్టాన్ని తప్పక పాటించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సుజాతారావు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, పురపాలకశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details