ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు.. అమరావతి రైతుల అభ్యంతరం

By

Published : Mar 26, 2022, 7:09 PM IST

Updated : Mar 26, 2022, 7:43 PM IST

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు

19:03 March 26

భూసేకరణ పరిహారం చెల్లింపు పూర్తికాకపోవడంతో రైతుల సందేహాలు

అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీఆర్​డీఏ ఇచ్చిన నోటీసులపై.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అభ్యంతరం తెలిపారు. భూసేకరణ కింద తీసుకున్న భూముల్లో ప్లాట్లు కేటాయించిన అధికారులు.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే.. భూసేకరణ పరిహారం చెల్లింపు పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్‌ ఏంటని రైతులు సందేహం వెలిబుచ్చారు. భూ సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు చూపాలని, అప్పుడే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని రైతులు సీఆర్​డీఏ లేఖ రాశారు.

ఇదీ చదవండి :
ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి

Last Updated : Mar 26, 2022, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details