ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో 72ను తక్షణం ఉపసంహరించుకోవాలి: సీపీఎం మధు - విశాఖలో కార్యనిర్వహక రాజధాని వార్తలు

విశాఖలో భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 72ను తక్షణమే ఉపసంహరించుకోవాలని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు

cpm-madhu-reaction-on-go-number-72-for-land-pooling-in-vishaka
cpm-madhu-reaction-on-go-number-72-for-land-pooling-in-vishaka

By

Published : Jan 28, 2020, 9:17 PM IST

మీడియాతో మాట్లాడుతున్న సీపీఎం మధు

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో భూసేకరణ కోసం ఇచ్చిన జోవో నెంబర్​ 72ను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... చిన్న,పేద,మధ్య తరగతి ప్రజల నుంచి భూములను సేకరించి ఎకరాకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. భవిష్యత్​లో రాజధాని పేరుతో విశాఖలో వేల ఎకరాలు సమీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజధాని, మండలి, విశాఖలో భూసమీకరణ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 151 సీట్లు వచ్చాయని ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కొన్ని పత్రికల్లో రాసినట్లు... కమ్యూనిస్టులకు యూటర్న్ లేదని... విధానపరమైన టర్న్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పూలింగ్​కు స్వస్తి పలికి 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'

ABOUT THE AUTHOR

...view details